హైదరాబాద్ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎంఎల్ఏ, సీపీఐ సీనియర్ నాయకులు కె సుబ్బరాజు గారు అనారోగ్యంతో మృతి చెందారు. విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా, సీపీఐ మరియు దాని అనుబంధ సంఘాల్లో వివిధ హౌదాల్లో పని చేస్తూ ప్రజలకు సేవలందించారు. వీరి మరణం సీపీఐ పార్టీకి మరియు వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు. సుబ్బరాజు మృతికి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది.
Mon Jan 19, 2015 06:51 pm