హైదరాబాద్ : ప్రముఖ వైద్యులు, నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు అనారోగ్యంతో మరణించడం బాధాకరం. అనునిత్యం పేదలకు ఉపయోగపడే ఉస్మానియా మెడికల్ కాలేజీలో సుబ్బారావు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవ చేసారు. కేవలం ఎముకల ఆసుపత్రిగా పేరున్న హైదరాబాదు నిమ్స్ను తాను డైరెక్టర్ అయ్యాక ఆ ఆసుపత్రిలో అన్ని విభాగాలను ప్రయివేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ది చేసి జాతీయ స్థాయిలో పేరుతెచ్చారు. దేశ, విదేశాల్లో కూడా వైద్యరంగ అభివృద్ధికి కాకర్ల ఎనలేని కృషి చేసారు. అమెరికాలో తెలుగువారందిరినీ ఒక్కతాటిపైకి తేవడానికి తెలుగు అసోసియేషన్కు వ్యవస్థాపక అధ్యక్షుడుగా మంచి కృషి చేసారు. సుబ్బారావు గారి మరణం వైద్యరంగానికి, ప్రజలకు తీరని లోటు. వీరి మరణానికి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm