హైదరాబాద్ : ఏపీ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్లో మొదటిసారి 6వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,962 పరీక్షలు నిర్వహించగా.. 6,096 కేసులు నిర్ధారణ కాగా.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,48,231 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm