హైదరాబాద్: కోవిడ్ తో మృతి చెందిన మృత దేహాలు తారు మారు అయినా ఘటన నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో కలకాలం రేపింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్ కు చెందిన నర్సుబాయి, ఇస్లాం పూరకు చెందిన బీబీలు కోవిడ్ పోజిటివ్తో ఆసుపత్రిలో చేరారు. అయితే ఇద్దరు చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ఒకేసారి మృతి చెందారు. కరోనా వ్యాధితో మృతి చెందడంతో వారి మృత దేహాలను ముఖం కనబడకుండా పూర్తిగా ప్యాక్ చేరారు..ఇక్కడవరకు బాగానే ఉన్నా.. ముందుగా బిబి మృత దేహాన్ని నర్సు బాయి కుటుంబసభ్యులకు అప్పగించారు.. దీంతో నర్సు బాయి కుటుంబసభ్యులు బిబి మృతదేహానికి అంత్య క్రియలు నిర్వహించారు.
అనంతరం నర్సు బాయి కుటుంబీకులు మర్చురీలో నర్సు బాయి మృత దేహం ఉన్నట్లు గుర్తించి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తమకు ఎలాంటి సంబంధం లేని బిబి మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించామని గుర్తించారు.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఒకరి మృత దేహాన్ని మరొకరికి అందజేయడం చర్చనీ యాంశంగా మారింది. అయితే దీనిపై ఆసుపత్రి వర్గాలు ఏలాంటి సమాధానం ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా ఇలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Apr,2021 09:34AM