- అమలుకాని హామీల వరాల జల్లులు
- మైనింగ్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, స్టీల్ ప్లాంట్ ఊసేలేదు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా
నవ తెలంగాణ భూపాలపల్లి
కేంద్రంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఒకటేనని ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అమలుకాని హామీల వరాల జల్లు కురిపిస్తాడని ప్రధాన హామీలు అయినా మైనింగ్ యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయించడం తదితర అ అంశాలపై శీజూ విఫలమయ్యారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత 19 రోజుల క్రితం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ముగింపు సభ సమావేశానికి చక్రపాణి అధ్యక్షత వహించగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా,ఆ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేష్, భాస్కర్ లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అభివృద్ధి మరచి కాలయాపన చేస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పలుమార్లు మా పార్టీకి ఏళ్ల చరిత్ర ఉందని గొప్పలు చెప్పుకుంటారు కానీ వారు చేసిన పనులు శూన్యం అన్నారు గతంలో కాకతీయుల కాలంలో చెరువులు కట్టించారు వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చారు మీరు ప్రజల సంక్షేమం కోసం బిజెపి ఏం చేసిందని అని ప్రశ్నించారు భారతదేశంలో సుమారు కోటి యాభై లక్షల మంది కి కరోనా వచ్చింది ఈ రోజు కూడా రెండు లక్షలు విల 15 వేల మంది చనిపోయారు దీనికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వాలు కాదా అని ఆయన ప్రశ్నించారు గత సంవత్సర కాలంగా కరోనా సమయంలో ఎప్పుడైనా జీపీ కార్మికులు ఆశా వర్కర్లు వైద్య శాఖ అధికారులు విలేకరులు మున్సిపల్ కార్మికులు సింగరేణి బొగ్గు కార్మికులు పని వదిలి ఉన్నారా అని ఆయన అన్నారు నిజమైన సేవకులు వీరు కాదా అని ఆయన అన్నారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిన్నప్పుడు నేను కూడా గుజరాత్ రైల్వే స్టేషన్ లో టీ అమ్ముతూ ఉన్నాను. ఈ క్రమంలో నేను ఈ స్థానానికి వచ్చానన్నారు అయితే మోడీ చిన్నతనంలో ఛాయా అమ్మడం జరిగింది ఇప్పుడు దేశాన్ని అమ్మేందుకు కుట్రపన్నుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమ్మలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని అన్నారు. ఇన్చార్జిల పాలనలో జిల్లా మొత్తం అభివృద్ధిలో కుంటుపడిపాయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు దారులకు పట్టాలు మంజూరు చేసి అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సహజ వనరులను ప్రైవేటీకరణ చేసి దోపిడీదారులకు ప్రధాని నరేంద్ర మోడీ కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఏర్పాటు చేస్తామన్న మైనింగ్ యూనివర్సిటీ, స్టీల్ ప్లాంట్ ఏమైంది అని ప్రశ్నించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లయితే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. ప్రైవేటీకరణ తో రిజర్వేషన్లు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలు గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీ ఉండాలి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయిపోయింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కొత్తగూడెం నుండి భూపాల్ పల్లి దాకా రైలు మార్గం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 లక్షల మంది పనిచేస్తూ జీవనాధారం పొందుతున్నారని ఇదే క్రమంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరిగితే మూడు లక్షల మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారు కదా అని ఆయన అన్నారు ఈ జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ గారు పేరు పెట్టారు బాగానే ఉంది కానీ అభివృద్ధి చేయడంలో అధికారులు పాలకులు విఫలమయ్యారన్నారు భూపాలపల్లి జిల్లా ప్రజలు చైతన్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అవసరం ఉందని భావించి సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పాదయాత్రలో పాదయాత్ర బృందానికి అనేక సమస్యలు వెల్లువెత్తాయి అని ఆయన వివరించారు అధికారులు ప్రభుత్వానికి నివేదికల ద్వారా అందజేయడం జరుగుతుందని జూన్ రెండో తేదీ వరకు జిల్లా అధికారులను నియమించడంలో ఎమ్మెల్యే చొరవ తీసుకోకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు, భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్రాభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో రెగ్యులర్ అధికారులను నియమించాలని కోరారు. సిపిఎం ఆధ్వర్యంలో లో చేరి పట్టిన పాదయాత్ర అ శక్తిని బలాన్ని చూపించుకోవడం కోసం కాదని ప్రజాసమస్యలు తెలుసుకొని పాలకులకు కనువిప్పు కలిగించేందుకు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు జిల్లాలో పింఛన్లు సమస్య లేకుండా చూడాలని, డబుల్ బెడ్ రూమ్ అర్హులైన వారందరికీ అందజేయాలని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇవ్వాలని, గ్రామాలలో ఉన్న సమస్యలు మండలాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి సమస్యలు పరిష్కరించకపోతే జూఎ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉండేది ఎర్రజెండా పార్టీలేనని పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకొని జిల్లా సమగ్రాభివృద్ధికి కావలసిన విషయాలను ప్రభుత్వం ముందు ఉంచడంలో విజయవంతం అయ్యామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రజలు వివిధ రకాల సమస్యలతో బాధ పడుతున్నారని అన్నారు. ఆడ మగ వడ్లను నాటి చాలా మంది రైతులు నష్టపోతారని తెలిపారు. గుత్తి కోయిల పై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపలన్నరు.. జిల్లాలో ఉన్న సహజ సంపదను, ఖనిజ వనరులను వినియోగించడంలో ప్రభుత్వాలు విఫలమైనందున పాదయాత్ర చేపట్టామని పేర్కొన్నారు. తక్షణమే భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. జిల్లా మొత్తం ఇంచార్జి అధికారులతో పాలన కొనసాగుతుందని, ఇలాగైతే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. జిల్లా తలపున గోదారి ఉన్న జిల్లా ప్రజలకు రైతులకు తాగు, సాగునీటి సమస్య తీరడం లేదు అన్నారు. జిల్లాలో ఉన్న మానేరు, చలి వాగు, ఊరించే వాగులో పై లిఫ్ట్ ఇరిగేషన్ లో ఏర్పాటు చేసి సాగునీరు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరించకుంటే సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జే వెంకటేశం, పాలడుగు భాస్కర్ ఎలిశెట్టి రాజయ్య, కంపెటి రాజయ్య, నాగుల అరవింద్, పసుల వినయ్, దామర కిరణ్ గుర్రం దేవేందర్ బుధరం శంకర్ పొలం రాజేందర్ తరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Apr,2021 08:18PM