హైదరాబాద్ : ఓ ట్రాన్స్జెండర్ను పెళ్లాడి మోసం చేసిన కేసులో అరెస్టై జైలుకెళ్లిన యువకుడు బెయిల్పై తిరిగొచ్చి ఆమెను మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొద్దిరోజుల్లోనే అతడిని మళ్లీ జైలుకు పంపారు. ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది. ఎల్బీనగర్కు చెందిన ఓ ట్రాన్స్జెండర్తో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కావలి తారక మహేష్(23)కు ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. గతేడాది జనవరిలో ఇద్దరూ సీక్రేట్ గా పెళ్లిచేసుకుని కాపురం పెట్టారు. మహేష్ సొంతూరిలోనే ఉంటూ వారానికోసారి ఎల్బీనగర్కు వచ్చి ఆమెను కలిసి వెళ్లేవాడు.
ఈ విషయం మహేష్ తల్లిదండ్రులకు తెలియడంతో అతడిని మందలించారు. దీంతో ఆమె వద్దకు రావడం మానేయడంతో పాటు ఫోన్ నంబర్ కూడా మార్చేశాడు. అయితే మహేష్ని వెతుక్కుంటూ ఏలూరు వెళ్లిన ఆమెను మహేశ్ కుటుంబసభ్యులు తీవ్రంగా అవమానించారు. మహేశ్ కూడా ఆమెతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ తిరిగొచ్చేసి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. తాజాగా బెయిల్పై జైలు నుంచి విడుదలైన మహేష్ ట్రాన్స్జెండర్పై కక్ష కట్టాడు. ఆమె ఫేస్బుక్ అకౌంట్ మార్చిందని తెలుసుకుని, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆమె యాక్సెప్ట్ చేసేసరికి అసభ్య పదజాలంతో ఛాట్ చేస్తూ వేధించసాగాడు. అసభ్య చిత్రాలు, వీడియోలు పెడుతూ ఇబ్బందులు సృష్టించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలను సేకరించగా మహేశే ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిసి షాకయ్యారు.. దీంతో గురువారం అతడిని మళ్లీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Apr,2021 08:36PM