హైదరాబాద్ : చెపాక్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మరోసారి ఆకట్టుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ను తమ పదునైన బంతులతో వణికించారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్(40: 39 బంతుల్లో 5ఫోర్లు), రోహిత్ శర్మ(32: 25 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. చివర్లో హార్డ్హిట్టర్ కీరన్ పొలార్డ్(35 నాటౌట్: 22బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) చెలరేగడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేసింది. రైజర్స్ బౌలర్లలో విజయ్ శంకర్, ముజీబ్ రెహమాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm