హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నుంచి మళ్లీ యథాతథంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సిన్ నిల్వలు లేకపోవటం, ఆదివారం సాయంత్రానికి గాని కొత్త డోసులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 30లక్షల డోసులు పంపాలని కోరగా గతంలో కేవలం 4.6లక్షలు మాత్రమే వచ్చాయి. ఆదివారం మరో 2.6 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm