హైదరాబాద్: శనివారం అర్ధరాత్రి ఓ కంటైనర్ అదుపుతప్పి గచ్చిబౌలి వద్ద డివైడర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం నగర శివార్లలోని గచ్చిబౌలి సమీపంలో ఔటర్ రింగ్రోడ్డుపై జరిగింది. ప్రమాద సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm