అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఏపీలో కొత్తగా 20.11 శాతాని పాజిటివిటీ రేటు చేరుకుంది. టెస్ట్ చేసిన ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్దారణ అవుతుంది. గడిచిన 24 గంటల్లో 35 వేల టెస్టుల్లో 7,224 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి. కాగా టెస్టులు పెరిగితే కేసులు భారీగా నమోదు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm