న్యూఢిల్లీ: వాట్సాప్ యూజర్లకు భారత్ సైబర్ సెక్యూరిటీ ఏజెనీంస హెచ్చరిక. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్లో తీవ్రమైన భద్రతాపరమైన లోపాలను గుర్తించినట్టు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) శనివారం ప్రకటించింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకొని హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడవచ్చని, సందేశాలు, ఫొటోలు వంటి వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని దొంగిలించవచ్చని హెచ్చరించింది. వాట్సాప్ యూజర్లు వెంటనే తమ వాట్సాప్ ను అప్డేట్ చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. ‘ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి వాట్సాప్, వాట్సాప్ బిజినెస్ వర్షన్ v2.21.4.18కు ముందు ఉన్న వర్షన్లలో, ఐవోఎస్ ఫోన్లకు సంబంధించి v2.21.32 వర్షన్లలో లోపాలను గుర్తించాం. సైబర్ దాడులకు గురికాకుండా వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ను ఇన్స్టాల్ చేసుకోండి’ అని సెర్ట్-ఇన్ సూచించింది.
Mon Jan 19, 2015 06:51 pm