న్యూఢిల్లీ : దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. రోజువారీ కేసులతో పాటు మరణాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో నాలుగో రోజు రెండు లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,88,109కు చేరింది. తాజాగా 1,38,423 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,28,09,643కి పెరిగింది. 1,501 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. ఇప్పటి వరకు 1,77,150 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 18,01,316 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.
కేసులు పెరుగుతున్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇప్పటి వరకు 12,26,22,590 డోసులు వేసినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒకే రోజు 15,66,394 టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 26.65 కోట్ల నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది.
ఇదీ చదవండి
కరోనా సోకిందని మాటల దాడి .. యువకుడు ఆత్మహత్య
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Apr,2021 11:47AM