జగిత్యాల: జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం ఒక్కరోజే 928 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరిలో చికిత్స పొందుతూ 9 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజా కేసుల్లో జగిత్యాల జిల్లా కేంద్రంలో 188 మంది, మెట్ పల్లిలో 150, కోరుట్లలో 109 మంది వైరస్ భారిన పడ్డారు. గత 3 రోజుల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగినట్టు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించక పోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు పాజిటివ్ ల సంఖ్య బహిర్గతం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ కరోనాను కట్టడి చేయాలి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Apr,2021 10:31AM