హైదరాబాద్: తెలంగాణలో టైగర్ టెన్షన్ మళ్లీ మొదలైంది. కొమురంభీం జిల్లా పెంచికల్ పేట మండలం ఆగర్ గూడలో పులి సంచారం చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఓ రైతుకు చెందిన రెండు ఎద్దులపై పులి దాడి చేయడంతో అందులో ఓ ఎద్దు మృతి చెందగా మరో ఎద్దు తీవ్రంగా గాయపడింది. అటవీ శాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారాన్ని అందించారు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియక భయం గుప్పిటలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm