జనగామ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తనను క్యాంపు ఆఫీసుకు పిలిచి బెదిరించారని, ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ జనగామ కోర్టు సీనియర్ లాయర్ కె.సునీత ఆరోపించారు. ఈ మేరకు డీసీపీ శ్రీనివా్సరెడ్డికి ఫిర్యాదు చేశారు. సునీత నివాసముండే 28వ వార్డు(గుండ్లగడ్డ)లో ఓ ముస్లిం ధార్మిక సంస్థ కొత్తగా మసీదు నిర్మాణం ప్రారంభించింది. ఆ నిర్మాణం తన ఇంటి పక్కనే ఉండడంతో భవిష్యత్తులో మతపరమైన గొడవలు వస్తాయని, పక్కనే గణేశ్ ఆలయం కూడా ఉందని కాలనీ ప్రజలతో కలిసి సునీత కలెక్టర్కు, మునిసిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు పనులను నిలిపివేయించారు. కాగా, ఈ విషయాన్ని ధార్మిక సంస్థ సభ్యులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సునీతతో పాటు కాలనీ వాసులను క్యాంపు ఆఫీసుకు పిలిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనను కాలనీ వాళ్లతో కనిపిస్తే అంతు చూస్తా అంటూ బెదిరించారని ఆరోపించింది. అయితే దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎవరినీ బెదిరించలేదని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm