ఆళ్లగడ్డ : వైసీపీ నాయకుడి ఇంట్లో పేకాట ఆడుతుండగా ఎస్ఈబీ పోలీసులు దాడి చేసి 30 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తొమ్మండ్రు వీధిలోని వైసీపీ నాయకుడు సింగం భరత్రెడ్డి ఇంట్లో ఆదివారం పేకాడుతున్న 30 మందిని అరెస్టు చేశామని ఎస్ఈబీ సీఐ సుదర్శన్రెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.6.23 లక్షల డబ్బులు, మూడు కార్లు, మూడు మో టార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడిచారు. పట్టుబడినవారిలో క డప జిల్లా ప్రొద్దుటూరు, మైదుకూరు, ఎర్రగుంట్ల పట్టణాల నుంచి వ చ్చిన వారున్నారని తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ముగ్గురు వై సీపీ నాయకులనూ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm