కర్నూలు : జిల్లాలోని చాగలమర్రి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైర్ పేలి పల్టీలు కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని వెంటనే ఆళ్లగడ్డ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన పెద్ద బోధనం గ్రామంలో చోటు చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm