పాట్నా: బీహార్లో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా బారిన పడిన మాజీ మంత్రి మేవాలాల్ చౌదరి పాట్నాలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ లో ఆసుపత్రిలో చనిపోయారు. మేవాలాల్ చౌదరి.. తారాపూర్ నుంచి జేడీయూ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మూడు రోజుల క్రితమే ఆయనకు కరోనా సోకింది. 2020లో తారాపూర్ సీటు నుంచి పోటీ చేసి గెలుపొందిన మేవాలాల్ చౌదరికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్యాబినెట్లో స్థానం కల్పించారు. మేవాలాల్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో ప్రతిపక్షాల ఆరోపణల నడుమ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm