న్యూఢిల్లీ : మావోయిస్టు అగ్ర నాయకుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బెటాలియన్-1 సారథి, మొన్న జరిగిన జవాన్ల మరణాలకు కారకుడు హిడ్మాను పట్టిస్తే రూ.7లక్షల రివార్డును అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా-బీజాపూర్ సరిహద్దులో ఈ నెల 3న మావోయిస్టులు జరిపిన దాడిలో భద్రతా దళాలకు చెందిన 22 మంది మృతిచెందారు.
అయితే ఈ దాడి హిడ్మా నేతృత్వంలో జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు హిడ్మాపై ఎన్ఐఏ ఇప్పటికే చార్జిషీట్ను దాఖలు చేసింది. ఇటీవల ఎన్ఐఏ బృందం ఛత్తీస్గఢ్లోని ఎన్కౌంటర్ సంభవించిన ప్రాంతంలో పర్యటించిన తర్వాత హిడ్మాపై రివార్డును ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 Apr,2021 11:27AM