న్యూ ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి మొదలై వచ్చే సోమవారం ఉదయం 5 గంటల దాకా లాక్ డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు. అంతకుముందు లాక్డౌన్పై కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో సమావేశమై చర్చించారు. కాగా ఢిల్లీలో ఆదివారం 25,462 కరోనా కేసులు నమోదు కాగా, 161 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం దిల్లీలో పాజిటివిటీ రేటు 30శాతంగా కొనసాగుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే దిల్లీలో వారాంతపు లాక్డౌన్ కొనసాగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm