అమరావతి: రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించారని... రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి క్లాసులను రద్దు చేస్తున్నామని.. వారందరికీ మంగళవారం నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. కాగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయన్నారు. వాటి షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని... ప్రస్తుతానికి ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నామన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతులను భౌతిక దూరం పాటిస్తూ.. కరోనా నిబంధనలను అనుసరిస్తూ క్లాసులు నిర్వహించాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm