వరంగల్: ఎంజీఎంలో కొవిడ్ పేషేంట్స్ పారిపోయిన ఘటనపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కొందరు రోగులు తెలిసీ,ర తెలియక పారిపోతున్నారని, ఒకరిద్దరు పోయినంత మాత్రానా వైద్యం అందలేదన్న మాట సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఎంజీఎంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో లాగా ఇక్కడ పరిస్థితి లేదని చెప్పారు. మన దగ్గర అంత సీరియస్ పరిస్థితి లేదని కొట్టిపారేశారు. మన దగ్గర లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm