హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మధ్యాహ్నం తర్వాత హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణ సంధర్భంగా 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని చీఫ్ జస్టిస్ సంచలన కామెంట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో నమోదైన కేసులు వార్డుల వారీగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ఆర్ టీపీసీఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. హాస్పిటల్ లో సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారి ఎవరినైనా నియమించాలని హైకోర్టు ఆదేశించింది.
Health.Telangana.gov.inaలో పేషెంట్ల వివరాలు నమోదు చేయాలని తెలిపింది. పెళ్లిళ్లు, శుభకార్యాలలో, పబ్లిక్ ప్లేస్ లలో ఎక్కువ మంది గ్యాదర్ ఐతే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డీజీపీ, ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక సరిగా లేదని మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది. ఇంటర్ స్టేట్ సరిహద్దుల్లో టెస్టులు చేయాలన్న హైకోర్టు 22న స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.