నల్లగొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. నియోజకవర్గంలో మొత్తం ఇవాళ 160 కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇతర టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కూడా కరోనా సోకింది. కాంగ్రెస్, బీజేపీ నేతలలో చాలా మంది కరోనా బారిన పడినట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతలు హోమ్ క్వారంటైన్కు వెళ్లినట్టు తెలుస్తోంది. కార్యకర్తలకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm