నవతెలంగాణ నవీపేట్
మండలంలోని యంచ, అల్జాపూర్ తదితర గ్రామాలలోని లబ్ధిదారులకు కొత్త పింఛన్లను మంజూరు చేయాలని జన చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు సంజీవ్ సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ గౌస్ కు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పింఛన్లు రాకపోవడం వలన భర్తలేని వితంతువులు, వృద్ధులు, వికలాంగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కావున వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయినాథ్ లక్ష్మణ్, రాజు, నరేష్ తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 Apr,2021 07:06PM