న్యూ ఢిల్లీ : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఓ పేషెంట్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని దమోహ్ ఎంపీ అయిన ప్రహ్లాద్ పటేల్ గురువారం జిల్లా హాస్పిటల్ కు వెళ్లారు. బుధవారం ఆ ఆస్పత్రిలో ఉన్న పేషెంట్ల బంధువుల.. ఆక్సిజన్ సిలిండర్లు ఉన్న గదిని ధ్వంసం చేశారు. ఆ వీడియోలు వైరల్ కావడంతోనే ప్రహ్లాద్ పటేల్ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ఒక వ్యక్తి మంత్రి వద్దకు వెళ్లి.. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ ఇవ్వట్లేదని ఆవేదన చెందాడు. దీంతో కేంద్ర మంత్రి తీవ్ర ఆగ్రహంతో.. రెండు చెంపదెబ్బలు తింటావని నోరుజారారు. ఇది విన్న ఆ బాధితుడు.. ఆవేదనతో మా అమ్మ అక్కడ పడి ఉంది అని ఏదో చెప్పబోయాడు. ఇంతలో జోక్యం చేసుకున్న మంత్రి.. ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వబోమని నీకు ఎవరైనా చెప్పారా? అని అడిగారు. దానికి ఆ వ్యక్తి అవును.. ఇవ్వలేమన్నారు. ఒక ఐదు నిమిషాలపాటు మాత్రమే మాకు ఆక్సిజన్ దొరికింది. దానికన్నా.. అసలు ఇవ్వబోమని చెప్పేస్తే సరిపోతుందిగా అని ఆవేదనగా చెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm