సుల్తానాబాద్ : మానేరు వాగులో దిగి ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లలో విషాదం నింపింది. ఐతురాజుపల్లి గ్రామం నుంచి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మానేరు వాగులో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో వాగులో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో వారిలో ముగ్గురు గల్లంతయ్యారు. వాగులో కొట్టుకుపోతున్న మరో ఐదుగురిని స్థానికులు కాపాడారు. అనంతరం గల్లంతైన వారికోసం గాలింపు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను ఐతరాజుపల్లికి చెందిన జోగుల ఆశీష్, జోగుల మనోజ్తో పాటు వేములవాడకు చెందిన రాహుల్గా గుర్తించారు. మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Mon Jan 19, 2015 06:51 pm