హైదరాబాద్ : భయం కరోనాకంటే ప్రమాదకరమైందని ఓ బ్యాంకు ఉద్యోగిని విషయంలో నిరూపితమైంది. బషీర్బాగ్లోని ఐడీబీఐ బ్యాంకు ఇంటి రుణాల విభాగంలో క్రెడిట్ మేనేజర్గా పని చేస్తున్న రేఖా శ్రీగౌరి(29)కి కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మృతి చెందింది. ఆమె కరోనా బారిన పడినప్పటి నుంచీ మానసికంగా ఆవేదనకు గురి అవుతోందని సహచర సిబ్బంది చెబుతున్నారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నవాళ్లలో రక్తం చిక్కబడుతుందని, గుండెపోటు రావడానికి ఇది ఒక కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm