న్యూ ఢిల్లీ : కరోనా కల్లోలం సృష్టిస్తున్న ప్రస్తుతం తరుణంలో పేదలకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. గతంలో లాక్డౌన్ సమయంలో పేదలు ఇబ్బందిపడకుండా ఉండేందుకు వారికి ఉచితంగా రేషన్ ద్వారా ఆహారధాన్యాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు కూడా అదే రకమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన పథకం కింద.. రాబోయే రెండు నెలల పాటు పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలు అందించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ మే, జూన్ నెలల్లో పేదలు ఉచితంగా ఆహార ధాన్యాలు పొందనున్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. ఇందుకుగానూ కేంద్రంపై రూ.26,000 కోట్ల భారం పడనుంది. ఈ పథకం కింది పేదలు ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం అందించనున్నారు. గతేడాది నవంబర్ వరకు కేంద్రం ఇదే రకంగా పేదలకు ఈ పథకం ద్వారా ఆహారధాన్యాలు అందించింది.
Mon Jan 19, 2015 06:51 pm