హైదరాబాద్: రెండురోజుల్లో పెండ్లి అనగా కరోనాతో వధువు మృతి చెందింది. ఈ ఘటన గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని కప్రదా తాలుగా మోటపొంధా గ్రామానికి చెందిన దిలీప్ పటేల్ కూతురి మనీషా బెన్ ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. పెండ్లి సమయం దగ్గర పడుతుండటంతో గత కొద్దిరోజులుగా ఇంటివద్దే ఉంటోంది. ఏప్రిల్ 24నే వివాహం అని ముహర్తం నిర్ణయించి కార్డులు కూడా పంచారు. అయితే ఇంతలో కరోనా సోకి సిల్వాసా ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అత్యవసరంగా ఓ ఇంజెక్షన్ అవసరమైంది. ఇంజెక్షన్ కోసం ఆమె కుటుంబ సభ్యులు సూరత్ వెళ్లగా.. ఇంజక్షన్ తెచ్చే లోపే ఆమె ప్రాణాలు విడిచింది. కరోనాతో నర్సు (వధువు) మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Apr,2021 04:10PM