హైదరాబాద్ : కరోనా విపత్తు గాంధీ ఆస్పత్రిలోని కొవిడ్ రోగుల పాలిట శాపంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్యతో సమయానికి ఆక్సిజన్ అందిస్తున్నా అది చాలడం లేదు. ఈ ఆస్పత్రిలో ఉన్న రెండు ఆక్సిజన్ ప్లాంట్లలో ఒక రోజుకు మొత్తం 26 టన్నుల ఆక్సిజన్ను (ఒక ప్లాంట్లో 20, మరో దాంట్లో 6 టన్నులు)లిండే అనే సంస్థ ఉత్పత్తి చేసి, అందిస్తోంది. ఈ 26 టన్నుల ఆక్సిజన్ ఆస్పత్రిలోని 800 మంది రోగులకు ఒక రోజు మాత్రమే సరిపోతుంది. 800 మందికి మించి హాస్పిటల్ కు రోగులు వస్తే మిగతా వారికి ఆక్సిజన్ అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Apr,2021 04:15PM