న్యూఢిల్లీ: భారత్లో కరోనా విరుచుకుపడటానికి మతపరమైన కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలే కారణమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఉధృతి పెరగడానికి సంక్రమణ వేగం ఎక్కువగా ఉన్న వైరస్ రకాలు మరో కారణమని తెలిపింది. దేశంలో కేసులు అధికంగా నమోదవడానికి గల కారణాలపై డబ్ల్యూహెచ్ఓ ఓ నివేదికను విడుదల చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి మతపరమైన, రాజకీయ పరమైన భారీ సమావేశాలు ప్రధానకారణమని పేర్కొంది. అదేవిధంగా సంక్రమణ వేగం ఎక్కువగా ఉన్న వైరస్ రకాలు వ్యాప్తిలో ఉండటం, ఆరోగ్య సామాజిక భద్రతా ప్రమాణాలను ప్రజలు పాటించకపోవడం కూడా దేశాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయని తెలిపింది. దేశంలో గత రెండు నెలల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, ఉత్తరాఖండ్లో కుంభమేళా జరిగిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్లే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని, దీనికి కేంద్ర ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీ.1.1.7, బీ1.612 తదితర రకాల కరోనా వేరస్లో భారత్లో కేసుల వేగాన్ని పెంచాయని వెల్లడించింది. ప్రమాదకర బీ.1.617 రకాన్ని దేశంలో తొలిసారిగా గతేడాది అక్టోబర్లోనే గుర్తించారని పేర్కొంది. అందులో ఉప రకాలు కూడా తర్వాత వెలుగుచూశాయని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 21 శాతం, బీ.1.617.1 వల్ల, ఏడు శాతం బీ.1.617.2 వల్ల వచ్చినవే ఉన్నాయని అభిప్రాయపడింది. ఇతర రకాలతో పోలిస్తే ఈ రెండూ అధిక సంక్రమణ వేగాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 13 May,2021 08:02AM