హైదరాబాద్: కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఏం దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 29 ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపి రూ. 5 లక్షల నగదుతో ఉడాయించిన సంగతి తెలిసిందే. నిందితుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితులు బీహార్ వాసులైన అజిత్ కుమార్, ముఖేష్ కుమార్ అని సీపీ తెలిపారు. ఇద్దరు నిందితుల నుంచి రూ. 6.31 లక్షలు, మూడు సెల్ఫోన్లు, నాటు తుపాకీతో పాటు ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏటీఎం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు అజిత్ కుమార్ అని సీపీ పేర్కొన్నారు. అజిత్ కుమార్ ఉపాధి నిమిత్తం 2011లో దుండిగల్కు వచ్చాడు. తొలుత కార్మికుడిగా, ఆ తర్వాత కాంట్రాక్టర్గా పని చేశాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిపై దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. 2018లో దుండిగల్లో మనీ ట్రాన్స్ఫర్ కార్యాలయంలో దోపిడీకి యత్నించి విఫలమయ్యాడు. పారిపోయే ప్రయత్నంలో పట్టుబడి అజిత్ జైలు పాలయ్యాడు. జైలు నుంచి వచ్చాక బీహార్ వెళ్లి.. రెండేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్కు వచ్చాడు. గండి మైసమ్మ వద్ద ఓ ప్యాకేజింగ్ పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు. స్నేహితుడు ముకేశ్ సాయంతో మళ్లీ నేరాలు చేసేందుకు కుట్ర చేశాడు.
ఈ క్రమంలో తుపాకీ కొనేందుకు ముకేశ్కు అజిత్ రూ. 30 వేలు పంపాడు. తుపాకీ, తూటాలు సమకూర్చిన ముకేశ్ సాయంతో అజిత్ దోపిడీలు చేశాడు. ఏప్రిల్ 16న మనీ ట్రాన్స్ఫర్ కార్యాలయంలో రూ. 1.15 లక్షలు దోపిడీ చేశారు. ఏప్రిల్ 24న దుండిగల్లో బైక్ చోరీకి పాల్పడ్డారు. ఆ తర్వాత ఏప్రిల్ 29న కూకట్పల్లి హెచ్డీఎఫ్సీ ఏటీఎం వద్ద చోరీ చేసినట్లు సజ్జనార్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 13 May,2021 08:15AM