అమరావతి: ఏవోబీలోని కొరాపుట్, మల్కాన్గిరి, విశాఖపట్నం జిల్లాల్లో మావోయిస్టు కీలకనేత దుబాసి శంకర్ అలియాస్ మహేందర్ అలియాస్ అరుణ్ అలియాస్ రమేష్ను ఒడిశాలో సోమవారం అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ అభయ్ తెలిపారు. ఆయన మంగళవారం భువనేశ్వర్లో విలేకర్లతో మాట్లాడారు. ‘కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ పోలీస్స్టేషన్ పరిధిలోని పేటగడ అటవీ ప్రాంతంలో ఎస్వోజీ, జిల్లా వాలంటరీ దళం, బీఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసులు కూంబింగ్ చేసి.. నోయరో గ్రామంలో శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడివద్ద ఇన్సాస్ రైఫిల్, 10రౌండ్ల బుల్లెట్లు, ఇతర సామగ్రి, రూ.35,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఆచూకీ చెప్పినవారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని గతంలో ప్రకటించాం’ అని ఒడిశా డీజీపీ అభయ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm