హైదరాబాద్ : ఈ రోజు సాయంత్రం గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణకు ట్యాంక్ బండ్ వేదిక కానుంది. ఆర్కెస్ట్రా నిర్వహించనుండగా పలువురు గాయనీ గాయకులు బాలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. అలాగే రైల్వే రక్షక దళం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సైతం ట్యాంక్బండ్పై నిర్వహించనున్నారు. ప్రతీ ఆదివారం ఏర్పాటు చేసినట్టుగానే ఈ సారి కూడా ఒగ్గుడోలు, గుస్సాడి, బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్టు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm