హైదరాబాద్: భార్యను హత్య చేసిన భర్త ఆపై ఆత్మహత్యకు యత్నించిన ఘటన నగరంలోని ప్రగతినగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం అర్ధరాత్రి సమయంలో భర్త కిరణ్.. భార్య సుధారాణి(20)ని గొంతుకోసి చంపాడు. అనంతరం చేయి కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. నెల రోజుల క్రితమే వీరి వివాహం జరిగింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి సుధారాణి మృతదేహం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm