శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బండిపొరలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. బండిపొరాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బండిపొరాలో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు గాలింపు బృందాలపై కాల్పులు జరిపాయి. దీంతో భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. వారు ఏ సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని, వారిని మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm