హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం మంత్రి స్పందించారు.
పవన్ కల్యాణ్ కన్నా సన్నాసి ఎవరూ ఉండరని అన్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ల తరఫున డైలాగులు చెప్పే వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు. బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకుని బతకాలనుకునే వ్యక్తి పవన్ అని ఆరోపించారు. పేకాట ఆడటానికి తప్ప పవన్ కల్యాణ్ దేనికీ పనికిరాడు అని మండిపడ్డారు. సామాన్యులకు భారం తగ్గించేందుకు టిక్కెట్లను ప్రభుత్వం అమ్మితే తప్పేంటని మంత్రి ప్రశ్నించారు. పవన్ రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోరని అడిగారు. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవితో పాటుగా మరి కొందరు పెద్దలు అడిగితేనే ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెట్ల ప్రతిపాదన పైన చర్చలు చేస్తోందని మంత్రి వివరించారు.
విజయవాడ కార్పొరేషన్ లో జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదని చెప్పారు. ఏపీలో పవన్ కల్యాణ్కు చోటు లేదని తెలిసిపోయిందని.. రాజకీయంగా ఎదగలేని నిరాశతో పవన్ మాట్లాడుతున్నారని చెప్పారు. తమపై పవన్ కల్యాణ్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని మంత్రి హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Sep,2021 12:27PM