హైదరాబాద్: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఓ చిన్నారి అపహరణకు గురైంది. తమ చిన్నారి కనపడకపోవడంతో పోలీసులు కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చర్యలు కొనసాగించారు. ఆ చిన్నారిని ఆసుపత్రి నుంచి ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. నిందితురాలు బంటుమిల్లి మండలం సుంకరపాలేనికి చెందిన మహిళగా తేల్చారు. దీంతో చివరకు ఎట్టకేలకు చిన్నారి ఆచూకీని గుర్తించారు. ఆ శిశువు క్షేమంగా ఉందని పోలీసులు ప్రకటించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని ఆమెను ప్రశ్నిస్తున్నామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm