హైదరాబాద్ : మహిళల క్రికెట్లో భారత క్రికెట్ ప్లేయర్ ఝులన్ గోస్వామి రికార్డు సృష్టించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఒకే ఓవర్లో ఆమె రెండు వికెట్లు తీయడం ద్వారా ఆమె క్రికెట్లో మొత్తం సాధించిన వికెట్ల సంఖ్య 600కు చేరింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ను ఔట్ చేయడం ద్వారా ఝులన్ ఈ ఘనత సాధించింది.
ఇప్పటికే ఆమె 192 వన్డేల్లో 239 వికెట్లు తీసి ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో ముందుంది. ఇక టెస్టుల్లో 41 వికెట్లు, టీ20ల్లో 56 వికెట్లు ఝులన్ తీసింది. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆమె మొత్తం వికెట్ల సంఖ్య 336కు చేరింది. ఇక డొమెస్టిక్ క్రికెట్లో 264 వికెట్లు తీయగా.. మొత్తం వికెట్ల సంఖ్య 600కు చేరింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Sep,2021 12:44PM