హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లిలోని రోహిణీ కోర్టులో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితులను ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక సెల్ అరెస్ట్ చేసింది. నిందితులు ఉమంగ్, వినయ్ లు ఇద్దరూ వాయువ్య ఢిల్లీలోని హైదేపూర్కు చెందిన వారుగా పోలీసులు పేర్కొన్నారు. రోహిణీ కోర్టులోని 4వ నంబర్ గేటు వద్ద అమర్చిన సీసీ టీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఉమంగ్, మరో ఇద్దరు షూటర్లతో కలిసి రోహిణీ కోర్టులోని సెక్టార్ 9లోని ఓ మాల్ దగ్గరకు కారులో వచ్చాడని, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతడు కారులోనే ఉండిపోయాడని సమాచారం. దుండగులు పని ముగించిన తర్వాత ఆ కారులో పారిపోయేందుకు సిద్ధంగా ఉండగా... ప్లాన్ బెడిసి కొట్టి.. తనతో వచ్చిన నిందితులిద్దరూ కాల్పుల్లో మరణించడంతో అతడు అక్కడి నుండి పరారయ్యాడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఇద్దరు నిందితులు న్యాయవాదుల దుస్తులు ధరించి.. కోర్టులోకి వచ్చి గ్యాంగ్ స్టర్ జితేందర్పై కాల్పులు జరపడంతో.. అక్కడే ఉన్న పోలీసులు వీరిపై ఎదురు దాడి చేయగా.. ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Sep,2021 02:13PM