హైదరాబాద్: పోరాట స్ఫూర్తిని చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఐలమ్మ 126 వ జయంతి సందర్భంగా సిక్ విలేజీ లోని మడ్ పోర్డ్ ధోభీ ఘాట్ వద్ద ఆమె విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా లోయర్ ట్యాంక్ బండ్ లోని ధోభీఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, అనేక భూ పోరాటాలు, పేద ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ధీర వనిత ఐలమ్మ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm