హైదరాబాద్ : జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం భారత్ విమానాలపై నిషేధాన్ని ఎత్తి వేసింది. మెరుగైన కొవిడ్ ప్రోటోకాల్స్ను దృష్టిలో పెట్టుకొని నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని ఆదివారం తెలిపింది. గత మంగళవారం భారత్ నుంచి అన్ని ప్రత్యక్ష వాణిజ్య, ప్రైవేటు ప్యాసింజర్ విమానాలపై ఆదివారం (సెప్టెంబర్ 26) వరకు నిషేధాన్ని పొడగించింది. గడువు ఇవాళ్టితో గడువు ముగియనున్న నేపథ్యంలో నిషేధాన్ని తొలగించింది.
Mon Jan 19, 2015 06:51 pm