హైదరాబాద్ : కోర్టుల్లో మహిళా న్యాయవాదులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో ఆదివారం సుప్రీంకోర్టు జడ్జిలకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో మహిళా న్యాయవాదులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దేశంలోని 22 శాతం కోర్టుల్లో మరుగుదొడ్లు లేవని తెలిపారు. మహిళలకు మౌలిక వసతులు కల్పించాలన్నారు.
ఇక సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు 11 శాతం మాత్రమే ఉన్నారని.. అటు హైకోర్టుల్లోనూ మహిళా జడ్జిలు 11.5 శాతం మాత్రమే ఉన్నారని వివరించారు. దేశంలోని మొత్తం 17 లక్షల మంది న్యాయవాదుల్లో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్రాల బార్ కౌన్సిళ్లలో 2 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని చెప్పారు. న్యాయవ్యవస్థలో 50 శాతం రిజర్వేషన్లు కావాలని మహిళలు అడగాలని సూచించారు. లా కాలేజీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. మహిళల న్యాయపరమైన డిమాండ్లకు తాను మద్దతిస్తానని తెలిపారు. విజయదశమి తర్వాత కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ ప్రారంభిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 Sep,2021 04:18PM