హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా వారం రోజులపాటు కొనసాగిన పెట్రో మంట మంగళవారం నిలిచింది. అయితే రెండు రోజులు విరామం ఇచ్చిన చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి వినియోగదారుల జేబుకు చిల్లువేశాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటరు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 38 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.109కి చేరగా, డీజిల్ ధర రూ.102.04కు పెరిగింది. గత సోమవారం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు 30 పైసల నుంచి 39 పైసల వరకు పెరిగాయి. దీంతో అక్టోబర్ నెలలో చమురు ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. గత 20 రోజుల్లో 15 రోజులు చమురు ధరలు అధికమయ్యాయి. దీంతో మంగళవారం నాటికి ఢిల్లీలో లీటరుకు రూ.4.55 పెరిగాయి.
Mon Jan 19, 2015 06:51 pm