హైదరాబాద్ : ప్రస్తుతం పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో చాలా మంది చూపు ఎలక్ట్రిక్ బైక్ ల వైపు చూస్తున్నారు. పలు కంపెనీలు కూడా లేటేస్ట్ ఫీచర్లతో కొత్త కొత్త ఎలక్ట్రిక్ బైక్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని గుంటూరులో ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు చెలరేగి నడి రోడ్డుపై తగలబడిపోయింది.
పూర్తి వివరాల్లోకెళ్తే.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ లో ఓ వ్యక్తి ఒక షోరూమ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్పై టెస్ట్ డ్రైవ్ కి వెళ్తున్నాడు. అందులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో భయాందోళకు గురైన అతను స్కూటర్ను అక్కడే వదిలేసి పరుగులు తీశాడు. స్కూటర్ చూస్తుండగానే మంటల్లో పూర్తిగా కాలిపోయింది. పెద్ద శబ్దంతో టైర్లు కూడా పేలాయి. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణం అని చెబుతున్నారు. దగ్ధమైన వాహనం విలువ రూ.65వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Oct,2021 09:13AM