హైదరాబాద్ : దేశంలో కొత్తగా 14,146 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే శనివారం 144 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 19,788 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,95,846 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,40,67,719 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో నుంచి మొత్తం 3,34,19,749 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 4,52,124కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 97,65,89,540 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Oct,2021 10:07AM