హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్స్ ఎన్నికలు ముగిసినా అందుకు సంబంధించిన వివాదం ముగియట్లేదు. తాజాగా ఇప్పుడు ఈ వివాదంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో సీసీ ఫుటేజ్ ను సీజ్ చేశారు. అందుకు కారణం.. సీసీ ఫుటేజీ మాయం చేస్తారనే అనుమానంతో ప్రకాశ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే.
ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 'మా` ఎన్నికల సమయంలో మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి చేశారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. దాడి దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో ఉన్నాయని.. తమకు ఆ సీసీ ఫుటేజ్ అందజేయాలని ప్రకాశ్ రాజ్.. ఎన్నికల అధికారిని కోరారు. అందుకు ఎన్నికల అధికారి.. ఫుటేజ్ భద్రంగా ఉందని.. నిబంధనల ప్రకారం తాము దానిని వారికి ఇస్తామని చెప్పారు. అయితే సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందన్న అనుమానంతో ప్రకాశ్ రాజ్ పోలీసులకు పిర్యాదు చేశారు. దాంతో ఆయన పిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు జూబ్లీహిల్స్ పోలీసులు తాళం వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Oct,2021 11:25AM