హైదరాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..జిల్లాలోని రెబ్బనలో ఓ బైకును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నుస్పూర్ నుంచి ఆసిఫాబాద్కు భార్య భర్తలు, వారిద్దరి కుమారులు.. మోటారు సైకిల్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రెబ్బన వద్ద వారి బైకును లారీ ఢీకొట్టింది. దాంతో తల్లీ కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Oct,2021 01:24PM