హైదరాబాద్ : కులమతాలను పక్కన పెట్టి అందరూ కలిసి ముందుకు వెళ్లాలనేదే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్లోని జలవిహార్లో జరుగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బండారు దత్తాత్రేయ గత 16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులని చెప్పారు. బతుకమ్మ, బోనాలు తెలంగాణ సంస్కతిని ప్రతిబింబిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ పండుగల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రాచీన భారతీయ నాగరికతను కాపాడుకోవాలని సూచించారు. భారతీయులైనందుకు, తెలుగు వారైనందుకు గర్వపడాలని అన్నారు. పాశ్చాత్య వ్యామోహం కారణంగా అలవాట్లు, అభిరుచులు మారుతున్నాయని.. మళ్లీ మన సంస్కృతిని అలవరచుకోవాలని సూచించారు.ప్రకృతితో కలిసి జీవించాలని, ప్రకృతిని కాపాడలన్నారు. కరోనా ప్రమాదం ఇంకా తొలగిపోలేదని చెప్పారు. ప్రతిఒక్కరూ కేంద్ర, రాష్ట్ర సూచనలు పాటించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Oct,2021 01:45PM